మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఈనెల మొదట్లోనే ఆమె పూణేకు వెళ్లింది. అక్కడి నుంచి ఇటీవలే ముంబై తిరిగొచ్చాక అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టు చేయించుకుంది. ఇందులో ఆమె పాజిటివ్ అని తేలినట్లు తెలిపింది. దీంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు పేర్కొంది. Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ? తన కుటుంబ సభ్యులు కూడా […]

Written By: Neelambaram, Updated On : August 13, 2020 10:04 am
Follow us on


ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఈనెల మొదట్లోనే ఆమె పూణేకు వెళ్లింది. అక్కడి నుంచి ఇటీవలే ముంబై తిరిగొచ్చాక అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టు చేయించుకుంది. ఇందులో ఆమె పాజిటివ్ అని తేలినట్లు తెలిపింది. దీంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు పేర్కొంది.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

తన కుటుంబ సభ్యులు కూడా తాజాగా అనారోగ్యం పాలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు వైద్యులు నిర్వహించారని తెలిపింది. ఇంకా ఆ రిపోర్టులు రావాల్సింది ఉందని చెప్పింది. వారంతా కూడా హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అలాగే తనతో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

నటషా సూరి 2006 సంవత్సరంలో ఫేమినా మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని గెలుచుకుంది. 2005లో మిస్ మహారాష్ట్ర, నేవీ క్వీన్ గా నిలిచింది. అదేవిధంగా 2004లో గెట్ గార్జియల్ విజేతగా నిలిచింది. 2006లో మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని సొంతం చేసుకోవడంతోపాటు మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ పర్సనాలిటీ అవార్డులను సొంతం చేసుకుంది. అదే సంవత్సరం మిస్ వరల్డ్ సెమీ ఫైనలిస్టుగా, మిస్ బెస్ట్ బాడీ(3వ స్థానం), ఉత్తమ డిజైనర్ గౌన్, మిస్ టాలెంట్ (టాప్-5)లో చోటు దక్కించుకుంది.

2016లో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మలయళ కామెడీ మూవీ ‘కింగ్ లయర్’ మూవీతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి రాకముందే నటషా సూరి టెలివిజన్ రంగంలో అనేక షోలకు హోస్టుగా చేసింది. ఇక పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల డిజైనర్ కంపెనీల తరపున అనేక ర్యాంపు షోల్లో పాల్గొంది. బాలీవుడ్ లో బా బా బ్లాక్ షీప్, వర్జిన్ భానుప్రియ సినిమాల్లో నటించింది. తాజాగా ‘డెంజరస్’ మూవీలో బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి నటించింది.

Also Read: వెంకీ కాదన్న రీమేక్‌లో అడవి శేష్!

అయితే తాను ‘డెంజరస్’ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉందని.. అయితే అనారోగ్య కారణాల రీత్య తాను పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం తాము చాలా కష్టపడ్డామని అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని వాపోయింది. త్వరలోనే రికవరీ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నటాషాకు కరోనా సోకిందనే విషయం తెలియడం ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా ఆమె కరోనా నుంచి కోలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.