వకీల్ సాబ్ టెన్షన్.. ఆడితే ఓకే.. లేకుంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చి రీఎంట్రీలో చేసిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా రిలీజ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలోని ‘పింక్’ సినిమా కథను తీసుకొని కమర్షియల్ కిచిడీని యాడ్ చేసి రూపొందించిన ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా? లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే స్టార్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. కలెక్షన్లు, బిజినెస్ […]

Written By: NARESH, Updated On : March 20, 2021 10:23 am
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చి రీఎంట్రీలో చేసిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా రిలీజ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలోని ‘పింక్’ సినిమా కథను తీసుకొని కమర్షియల్ కిచిడీని యాడ్ చేసి రూపొందించిన ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా? లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

ఎందుకంటే స్టార్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. కలెక్షన్లు, బిజినెస్ కు ఢోకా లేకున్నా.. పాజిటివ్ టాక్ వస్తే రెండింతలు లాభాలు.. ‘అజ్ఞాతవాసి’లో బోల్తా కడితే మాత్రం ట్రోలింగ్ తోపాటు భారీ లాస్ తప్పదు. ఇటీవల దిల్ రాజు జడ్జిమెంట్ కూడా బాగా దెబ్బతిందన్న టాక్ టాలీవుడ్ లో ఉంది. దీంతో వకీల్ సాబ్ సినిమా టెన్షన్ ఇప్పుడు నిర్మాతతోపాటు పవన్ అభిమానుల్లో కూడా ఉంది.

ఇక పవన్ కళ్యాన్ రాజకీయాలపై చూపిన ప్రేమ సినిమాలపై చూపడు. ఆయన సినిమా ప్రమోషన్లకు అస్సలు రాడు. మీడియాతోనూ సినిమాలపై ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఏది జరిగినా మూవీ ప్రీరిలీజ్ వేడుకలోనే..

అందుకే చిరంజీవి, రాంచరణ్ ను వేడుకకు దిల్ రాజు తీసుకొస్తున్నాడు. దాంతో ముగ్గురు మెగా హీరోలతో బజ్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పాత పీఆర్ టీంను మార్చేసి కొత్త వారిని పెట్టి సరికొత్తగా ప్రచారం షూరూ చేస్తున్నాడట.. ఎప్పుడూ లేని టెన్షన్ ఇప్పుడు వకీల్ సాబ్ తో నిర్మాత దిల్ రాజులో మొదలైందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమా హిట్ కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నట్టు టాక్.