జాతిరత్నాలు ట్రైలర్ టాక్: గందరగోళంతో కామెడీ పంచారు

ఇద్దరు కమెడియన్లు, ఒక హీరో కలిసి తీసిన మూవీ ‘జాతిరత్నాలు’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రధారులు. ఈ ముగ్గురు కలిసి కామెడీ చేసిన చిత్రమే ‘జాతిరత్నాలు’. ఫరుక్ అబ్దుల్లా హీరోయిన్. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన […]

Written By: NARESH, Updated On : March 5, 2021 12:18 pm
Follow us on

ఇద్దరు కమెడియన్లు, ఒక హీరో కలిసి తీసిన మూవీ ‘జాతిరత్నాలు’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రధారులు. ఈ ముగ్గురు కలిసి కామెడీ చేసిన చిత్రమే ‘జాతిరత్నాలు’. ఫరుక్ అబ్దుల్లా హీరోయిన్.

స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ‘జాతిరత్నాలు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం సాగింది. లేడిస్ ఎంపోరియం నడిపే హీరో నవీన్ తో మిత్రులు రాహుల్, ప్రియదర్శి కలవడం.. వీరు ఓ కేసులో ఇరుక్కొని జైలు పాలు కావడం.. దాన్ని నుంచి వారు ఎలా బయటపడ్డారన్నది చూపించబోతున్నారు.

మధ్యలో ప్రేమ, వీరి గందరోళ పరిణామాలు.. జాతిరత్నాలు గోలగోల చేశారు. బ్రహ్మానందం చివర్లో జడ్జిగా చేసిన సీన్ ఆకట్టుకుంది. మార్చి11న ప్రపంచవ్యాప్తంగా ఈ కామెడీ చిత్రం విడుదల కాబోతోంది.