ఏంటసలు?: ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. రేపటి వరకు ఉత్కంఠ

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ నిత్యం ఏదో ఒక అప్డేట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. కానీ కరోనా కారణంగా ఆరేడు నెలలుగా ఏ అప్డేట్ లేకుండా ఆర్ఆర్ఆర్ టీం వెలవెలబోయింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. అది అభిమానుల్లో ఫుల్ జోష్ […]

Written By: NARESH, Updated On : October 5, 2020 6:39 pm
Follow us on

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ నిత్యం ఏదో ఒక అప్డేట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. కానీ కరోనా కారణంగా ఆరేడు నెలలుగా ఏ అప్డేట్ లేకుండా ఆర్ఆర్ఆర్ టీం వెలవెలబోయింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. అది అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపింది.

‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్.. కొమురంభీంగా ఎన్టీఆర్ కన్పించబోతున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న సమయంలో కరోనాతో సినిమా వాయిదా పడింది. ఈ మూవీ షూటింగు ప్రారంభిస్తారని అనుకున్న సమయానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారిన పడ్డారు.

దీంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవల వీరంతా కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఈనెలాఖరు వరకు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ‘ఆర్ఆర్ఆర్’ టీం 14రోజులపాటు క్వారంటైన్లోకి వెళ్లనుంది. ఈనెల 10నుంచే సినిమా నటులందరూ ఓ హోటల్లోని ప్రత్యేక గదుల్లో క్వారంటైన్లో ఉంటారని తెలుస్తోంది. ఇందులో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం.

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేసే ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేయించడం.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా నటీనటుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. నటీనటుల క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యాకే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్.. రాంచరణ్ పాల్గొననున్నారని టాక్ విన్పిస్తోంది.

అయితే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలతో షూటింగ్ స్ట్రాట్ అయినట్టు తెలుస్తోంది. అలా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి రేపు (మంగళవారం) ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్ రానున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్ చేసింది.

‘మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పరిచినందుకు ధన్యవాదాలు. సమయం గడిచింది. చివరకు ఆ క్షణం వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం మా వంతు. రేపటి కోసం వేచి ఉండండి’ అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్ చేసింది.

దీంతో అందరూ ఎన్టీఆర్ ‘కొమురం భీం’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అదేంటనేది రేపటిదాకా అందరినీ అభిమానులను టెన్షన్ పెడుతోంది.