ఆ నేతపై టాలీవుడ్ లో మరో బయోపిక్.. పెను దుమారం..

వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఫక్తు తెలుగు రాష్ట్రాల్లోని వివాదాలనే తెరకెక్కిస్తుంటాడు. కానీ ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతూ ‘క్యాష్’ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వర్మ తీసిన ‘వంగవీటి రంగా’ సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వంగవీటి రంగాకు బద్ధ శత్రువైన ‘దేవినేని నెహ్రూ’ జీవిత కథ ఆధారంగా దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు ‘దేవినేని’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను జీఎస్ఆర్, రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. నందమూరి తారకరత్నం ఈ […]

Written By: NARESH, Updated On : February 16, 2021 10:39 pm
Follow us on

వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఫక్తు తెలుగు రాష్ట్రాల్లోని వివాదాలనే తెరకెక్కిస్తుంటాడు. కానీ ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతూ ‘క్యాష్’ చేసుకునే పనిలో పడ్డారు.

ఇప్పటికే వర్మ తీసిన ‘వంగవీటి రంగా’ సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వంగవీటి రంగాకు బద్ధ శత్రువైన ‘దేవినేని నెహ్రూ’ జీవిత కథ ఆధారంగా దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు ‘దేవినేని’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను జీఎస్ఆర్, రాము రాథోడ్ నిర్మిస్తున్నారు.

నందమూరి తారకరత్నం ఈ సినిమాలో హీరోగా ‘దేవినేని’ పాత్రలో నటిస్తున్నారు. దేవినేని నెహ్రూ, వంగవీటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు, హత్యలే కథాంశంగా తీసుకొని ఈ సినిమా తీస్తున్నారు.

అయితే ఈ సినిమాపై ‘దేవినేని నెహ్రూ’ తనయుడు, వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే సినిమా నిలిపివేయాలని డిమాండ్ చేసి దర్శకుడు, నిర్మాతలపై కేసు పెట్టాడు. దీంతో టాలీవుడ్ లో మరో బయోపిక్ వివాదాస్పదమైంది.