spot_img
Homeలైఫ్ స్టైల్Young People Mistakes: నేటి కాలంలో యువత చేసే పొరపాట్లు ఇవే..

Young People Mistakes: నేటి కాలంలో యువత చేసే పొరపాట్లు ఇవే..

Young People Mistakes: కాలం మారుతున్న కొద్ది సాంకేతికం అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి సమయంలో ఒకప్పుడు కష్టంగా చేసిన పనులను ఇప్పుడు సులువుగా పూర్తి చేస్తున్నారు. అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సంతోషపడాలో.. దుఃఖించాలో అర్థం కావడం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్ది ఆందోళన ఎక్కువ కావడమే కానీ తగ్గడం లేదు. గతంలో ఆహారం, ఆరోగ్యం కోసం ఆందోళన ఉంటే.. ఇప్పుడు డబ్బు కోసం కష్టపడుతున్నారు. అయితే ఇందులో యువత ఎక్కువగా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. అనుకున్న స్థాయిలో డబ్బు పొందేవారు సైతం మనశ్శాంతి లేకపోవడం చూస్తే వారు చేసే కొన్ని పొరపాట్లే అని అర్థమవుతుంది. ఆ పొరపాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు ఒక ఉద్యోగికి రూ. 10,000 లోపు ఆదాయం వచ్చేది. ఈ ఆదాయంలో అతడు ఎంతో సంతోషంగా ఉండగలిగాడు. కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడిపాడు. కానీ ఆ ఆదాయం కంటే ఇప్పుడు అది రేట్లు ఎక్కువగా పొందుతున్నారు. మరి ఆదాయం పెరిగినప్పుడు సంతోషం అంటే దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఏమిటంటే ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. యువత తమకు వచ్చే ఆదాయాన్ని సరైన విధంగా పంపిణీ చేయకపోవడంతో కష్టాల పాలవుతున్నారని చెబుతున్నారు.

ఒక యువకుడు లేదా యువతికి 30 ఏళ్లలోపు ఉద్యోగం వస్తే.. తనకు కనీసం లక్ష రూపాయల వరకు జీతం ఉంటే.. అందులో ఎక్కువ శాతం ఈఎంఐ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగం లోకి చేరిన వెంటనే ముందుగా ఇల్లు లేదా కారును కొనుగోలు చేస్తున్నారు. ఇలా ముందుగానే వాటిని కొనుగోలు చేసి ఈఎంఐ లలో పెట్టుకుని వచ్చిన ఆదాయంలో సగం వరకు వాటికి వెచ్చిస్తున్నారు. అయితే చాలామంది తమకు అవసరం లేకుండా కూడా ఇతరులను చూసి ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు తమ స్నేహితులకు లేదా తోలి ఉద్యోగులకు కారు ఉందని.. తమకు లేదని గిల్టీ ఫీలింగ్ తో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇలా అవసరం లేకున్నా వాటిని కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఈఎంఐ లకు వెళ్ళిపోతుంది. దీంతో సాధారణ జీవితం గడపడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది.

ఇలా చేయడం వల్ల ఎప్పటికీ మనశ్శాంతిని పొందలేకపోతున్నారు. కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం యువత తమకు వచ్చే ఆదాయంలో 50% మాత్రమే ఈఎంఐ లను ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా అత్యవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తే మాత్రమే. కొన్నాళ్లపాటు ఆదాయం పెరిగిన తర్వాత అప్పుడు వస్తువుల కొనుగోలు గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు శాశ్వతం అని ఎవరు చెప్పలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగం ఓడిపోతే అప్పుడు మరింత బాధ పడాల్సి వస్తుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు తమకు వచ్చే ఆదాయంలో సొంతంగా పొదుపు చేసుకొని ఆ తర్వాత వస్తువుల గురించి ఆలోచించాలి. లేకుంటే ప్రతిరోజు కష్టంగానే గెలుస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper