Respect: సమాజంలో ప్రస్తుతం మనిషి చేసే పని కంటే వారి హోదాకే ఎక్కువగా విలువను ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు చిరు వ్యాపారుల కంటే కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారికే ఎక్కువగా వాల్యే ఇస్తారు. అలాగే ప్రైవేట్ జాబ్ చేసే వారికంటే ప్రభుత్వ ఉద్యోగాలను చేసే వారికి కొంచెం ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంటారు. చేసే పనిని బట్టి ఇచ్చే విలువ కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ విధంగా పనిని బట్టి మనిషికి విలువ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
ఈ క్రమంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో సమోసాలు అమ్మే అబ్బాయి సంభాషణతో ప్రతి ఒక్కరిలో ఓ ఆలోచన మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంతకీ వారిద్దరి మధ్య సంభాషణ ఏంటి? అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ యువడుడికి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది. దీంతో ప్రతి ఒక్కరూ అంత పెద్ద కంపెనీలో జాబ్ రావడం అంత సులువైన విషయం కాదు.. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే సొసైటీలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుందనే మాటలు వినిపించాయి. కొత్తలో కష్టంగా ఉన్న భవిష్యత్ లో బాగుంటుందని చెప్పడంతో ఏమీ ఆలోచన చేయకుండా జాయిన్ అయిపోయాడు. ఉద్యోగంలో చేరి సుమారు రెండేళ్లు అవుతున్నా ఏమీ ఛేంజ్ కనిపించలేదంట. మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకొన్నాడనే పేరు తప్పితే ఏం లేదట. పొద్దునే లేచి సిటీ ట్రైన్ లో ఆఫీస్ కి వెళ్లడం.. రాత్రికి మళ్లీ అదే ట్రైన్ లో ఇంటికి రావడం.. ఎవరైనా ఉద్యోగులకు ఇదే దినచర్యని చెప్పొచ్చు. ఈ క్రమంలో రోజులానే ఆఫీస్ కాగానే ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కాడు ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. అతనికి ఎదురుగా దాదాపు తన వయసే ఉన్న వ్యక్తి చేతిలో పెద్ద బుట్ట కనిపించింది. దాన్ని బట్టి అతను సమోసా వ్యాపారి అని అర్థం చేసుకున్నాడు. ఖాళీగా ఉండలేక వ్యాపారితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
చిరు వ్యాపారితో మాట్లాడిన తరువాత ఉద్యోగి మనసులో పలు ప్రశ్నలు మెదిలాయి..2 వేల సమోసాలు అమ్మడం అంటే ఒక్కరోజుకు ఆ వ్యాపారి సంపాదన పది హేను వందలు. అంటే నెలకు రూ.45 వేలు.. రెండేళ్లుగా పెద్ద కంపెనీలో పని చేస్తున్న తన జీతం నెలకు కేవలం రూ.15 వేలు .. అంటే సాధారణ వ్యాపారి తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని అర్థం అయింది. ఆ తరువాత సంభాషణలో భాగంగా వ్యాపారిని చదువుకోవాలని అనిపించలేదా? అని అడిగాడట ఉద్యోగి.. దానికి సమాధానంగా లేదన్నా.. చదువుకుంటే ఉద్యోగాన్ని నా బిడ్డలకు ఇవ్వలేను కదా.. అదే వ్యాపారం చేస్తే దాన్ని వాళ్లకు ఇవ్వగలను.. వ్యాపారంలో చాలానే నేర్చుకున్నానన్న వ్యాపారి.. అందుకే చదువుకోవాలనే ఆలోచన చేయలేదన్నాడు..
అయితే వ్యాపారి చెప్పిన ప్రతి మాట ఆ ఉద్యోగి మనసులో నుంచి బయటకు పోవడం లేదట. సాధారణ వ్యాపారిగా ఉన్న ఆయన ఎంత తెలివిగా ఆలోచించాడు. చదువుకున్న నేను నలుగురు చెప్పారని ఉద్యోగంలో చేరిపోయా.. కానీ ఒక్కసారి కూడా జాబ్ కరెక్టా ? కాదా ? అని ఆలోచన చేయలేకపోయానని అనుకున్నాడట.
దీన్ని అంతటిని బట్టి విలువ అనేది మనిషి చేసే పనిని బట్టి కాదు.. మనిషి ఆలోచనలు బట్టి అని స్పష్టం అవుతుంది. చేసే పనిలో చిన్న పెద్ద అనే తేడా ఉండదు.. ఏ పని అయినా ఎంత కష్టపడి చేస్తున్నామన్నదే ముఖ్యం. అందుకే కష్టపడి నిజాయితీగా చేసే ప్రతి వ్యక్తికి సమానంగా గౌరవం ఇవ్వాలి.