spot_img
Homeబిజినెస్Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు శుభవార్త.. రోజుకు 500 ఎంబీ డేటా ఉచితం!

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు శుభవార్త.. రోజుకు 500 ఎంబీ డేటా ఉచితం!

Airtel: ప్రముఖ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ తాజాగా ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరల పట్ల ఎయిర్ టెల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ టెల్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ప్రీపెయిడ్‌ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500 ఎంబీ డేటాను ఫ్రీగా అందించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ టెల్ నుంచి 500 ఎంబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

ఎయిర్ టెల్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటారో వాళ్లకు 500 ఎంబీ ఉచిత డేటా లభించనుంది. ఎయిర్ టెల్ ‎ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం వరకు పెంచగా డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌లపై 20 నుంచి 21 శాతం వరకు పెంచడం గమనార్హం. ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్ టెల్ తాజా నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం ఎయిర్ టెల్ మినిమం రీఛార్జ్ విషయానికి వస్తే మినిమం రీఛార్జ్ 99 రూపాయలుగా ఉంది. మినిమమ్ రీఛార్జీ 79 రూపాయల నుంచి 99 రూపాయలకు పెరిగింది. ఎయిర్ టెల్ బాటలో వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ధరలను ఊహించని స్థాయిలో పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు తక్కువగా ఉన్నాయి.

కొంతమంది ఎయిర్ టెల్ యూజర్లు జియోకు పోర్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎయిర్ టెల్ అదనపు డాటా ఆఫర్లను ప్రకటించింది. జియో కూడా రాబోయే రోజుల్లో టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version