spot_img
Homeకరోనా వైరస్Excessive Sweating: చెమటలు అధికంగా పడితే అనర్థమేనా?

Excessive Sweating: చెమటలు అధికంగా పడితే అనర్థమేనా?

Excessive Sweating: మన ఆరోగ్యం గురించి మన దేహం చెబుతుంటుంది. మనమే ఎక్కువగా పట్టించుకోం. మనకు కొన్ని సంకేతాలు ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని శరీరం మనకు సూచనలు చేస్తుంటుంది. కానీ మన పనిలో మనం ఉండి వాటిని గురించి పట్టించుకోం. తీరా సమయం మించిపోయాక అయ్యో అంటే ఏం లాభం. మన శరీర వ్యవస్థలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అన్ని సక్రమంగా పనిచేయాలంటే అన్నింటికి సమాన స్థాయిలో మేత అందాలి. లేకుంటే అవి పాడైపోయి మన కథను కూడా ముగిస్తాయి. అందుకే మన శరీరం విషయంలో నిత్యం ఓ కన్ను వేస్తుండాలి. అప్పుడే మనకు ఏం జరుగుతుందనే దానిపై స్పష్టత రావడం ఖాయం.

Excessive Sweating
Excessive Sweating

కొంతమందికి ఊరకే చెమటలు పడుతుంటాయి. మరికొందరికి ఏ చిన్న పని చేసినా చెమటలు విపరీతంగా రావడం తెలిసిందే. ఇంకొందరికి చెమటలే పట్టవు. చెమట పడితేనే ఆరోగ్యం. చెమట పట్టేవారికే ఆరోగ్యం బాగుంటుందని తెలిసినా అధికంగా చెమటలు పట్టడం మాత్రం అనారోగ్య లక్షణమని చెబుతున్నారు. చీటికి మాటికి చెమలు పట్టే వారు ఉంటారు. ఏమంటే అధిక వేడి వల్ల చెమటలు పడుతున్నాయని అంటుంటారు కానీ అది అనారోగ్యానికి కారణమేనట. అందుకే చెమలు ఎక్కువగా పట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

Also Read: YCP MPs: సగం మందికిపైగా ఎంపీలకు నో చాన్స్.. వైసీపీలో ఏం జరుగుతోంది?

అధిక చెమటలు పడితే శరీరం దుర్వాసన వస్తుంది. ముచ్చెమటలు పట్టడానికి కారణం గుండె కవాటాలు పనిచేయకపోవడమే అని వైద్యులు చెబుతున్నారు. దీంతో పలు రకాల రోగాలు కూడా చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఎముకల సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాలు తలెత్తే సూచనలు కనిపిస్తాయి. అందుకే అధిక చెమటలు పడితే మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అధిక చెమటలు పట్టే బాధితులు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటేనే ప్రయోజనకరం.

Excessive Sweating
Excessive Sweating

చెమటలు ఎక్కువగా పట్టే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లాభం కలుగుతుంది. ఉప్పు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. విటమిన్లు, ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు, వాల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే చెమట పట్టదు. అదే పనిగా చెమట పడుతుంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స చేయించుకుని మందులు వాడితేనే మంచిది. లేదంటే ఏవో రోగాలకు దారి తీసి ప్రాణాపాయం కలిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో చెమటలు పట్టే బాధితులు తస్మాత్ జాగ్రత్త.

చెమటలు పట్టేవారు మంచినీరు ఎక్కువగా తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. నీరు ఎక్కువగా తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. తద్వారా చెమటలు ఎక్కువగా పట్టవు. వైద్యుల సలహాల మేరకు వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోనే మేలు కలుగుతుంది. చెమటలు ఎక్కువగా పట్టేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read:Commonwealth Games 2022: భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. అదరగొట్టిన జెరెమీ



Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper