spot_img
Homeలైఫ్ స్టైల్Corona : కరోనా తగ్గినా వాసన రాకపోవడానికి కారణాలేంటో తెలుసా?

Corona : కరోనా తగ్గినా వాసన రాకపోవడానికి కారణాలేంటో తెలుసా?

Corona : కరోనా ప్రభావం మనుషుల మీద గణనీయంగానే పడింది. అప్పటి నుంచి కరోనా బారిన పడిన వారికి వాసన రావడం లేదు. ముక్కులో వాసనను పసిగట్టే నాడీ కణాల మీద ప్రభావం పడటంతో నాడీ కణాల సంఖ్య పడిపోయింది. ఫలితంగా ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతోంది. ఓ అధ్యయనంలో ఈ విషయం కనుగొన్నారు. కొవిడ్ 19 కారక వైరస్ దాడి చేయడం వల్ల ముక్కు వాసన పసిగట్టే భాగం తీవ్రంగా దెబ్బ తిన్నట్లు గుర్తిస్తున్నారు. దీని ప్రభావంతో వాసన చూసే శక్తిని కోల్పోవడం జరుగుతోంది.

వాసన ఎందుకు కోల్పోతాం

కరోనా వైరస్ సోకిన వారికి మొదటి లక్షణం వాసన కోల్పోవడం, తరువాత దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా పరీక్ష చేయించుకునే వారు. కరోనా గాలి ద్వారా సోకే వ్యాధి కావడంతో అది మొదట మన ముక్కు మీదే ప్రభావం చూపిస్తోంది. అందుకే మనం వాసన కోల్పోవడం జరుగుతుంది. ఇలా కరోనా కాలంలో అందరు ఎంతో భయపడిపోయారు. తరచు పరీక్షించుకున్నారు. ముక్కు పనిచేస్తోందా లేదా అని చూసుకున్నారు. ఇలా కరోనా మహమ్మారి మన జీవితాల మీద పెను ప్రభావమే చూపింది.

ఎందుకీ ప్రభావం

కరోనా కాలంలో వేలాది మంది దాని బారిన పడి నానా యాతన అనుభవించారు. క్వారంటైన్ లో ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. కరోనా ప్రభావంతో వృద్ధులైతే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంత మంది కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి వారిలో నరాల భాగంలో ఉండే కణజాలం దెబ్బతిని వాసన ప్రభావం పోయినట్లు గుర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా కొందరికి వాసన రావడం లేదంటే అతిశయోక్తి కాదు. కరోనా చూపిన పెను ప్రభావానికి అందరు బాధితులయ్యారు.

మళ్లీ రెక్కలు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మొదటి, రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు. అందుకే మన దేశంలో అంతలా ప్రభావం చూపడం లేదు. కానీ చైనాలో దాని తీవ్రత ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటున్నా అది మనతోనే సహవాసం చేసేందుకు రెడీ కావడం అందరిలో ఆందోళనకు కారణమవుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
Oktelugu Epaper
Exit mobile version