
కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదని ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా పోరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేది జగన్ విధానమన్నారు. జలాల వినియోగంపై సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.