మంటలు అంటుకున్న బీజేపీ ఎంపీ మనువరాలు మృతి

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రయాగ్ రాజ్ ఎంపీ బహుగుణ జోషి మనువరాలు టాపాసులు పేలీ మృతి చెందింది. దీపావళి రోజు రాత్రి బహుగుణ జోషి మనువరాలు కియా టపాసులు పేల్చేందుకు ఇంటి బాల్కని పైకి వెళ్లింది. టపాసులు పేలుస్తుండగా కియా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. అయితే బాణసంచా శబ్దాలతో కియా అరుపులు ఎవరికీ వినిపించలేదు. అప్పటికే చిన్నారి శరీరం 60 శాతం కాలిపోయింది. మెరుగైన చికిత్స కోసం కియాను మంగళవారం ఢిల్లీకి తీసుకెళ్లాల్సి […]

Written By: Suresh, Updated On : November 17, 2020 12:07 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రయాగ్ రాజ్ ఎంపీ బహుగుణ జోషి మనువరాలు టాపాసులు పేలీ మృతి చెందింది. దీపావళి రోజు రాత్రి బహుగుణ జోషి మనువరాలు కియా టపాసులు పేల్చేందుకు ఇంటి బాల్కని పైకి వెళ్లింది. టపాసులు పేలుస్తుండగా కియా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. అయితే బాణసంచా శబ్దాలతో కియా అరుపులు ఎవరికీ వినిపించలేదు. అప్పటికే చిన్నారి శరీరం 60 శాతం కాలిపోయింది. మెరుగైన చికిత్స కోసం కియాను మంగళవారం ఢిల్లీకి తీసుకెళ్లాల్సి ఉండగా ఈరోజు ఉదయం కియా మరణించింది. దీంతో బహుగుణతో పాటు కుటుంబ సభ్యలులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా కియా ఇటీవల కరోనా నుంచి కోలుకుంది.