ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకల్లో మొదలైన వివాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామ వాలంటీర్ కుటుంబ సభ్యులు, వధువు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో వరుడి బాబాయి లక్క పోగు సబ్బారావు మృతి చెందాడు. ఇరు కుటుంబాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Written By: Suresh, Updated On : June 24, 2021 8:26 am
Follow us on

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకల్లో మొదలైన వివాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామ వాలంటీర్ కుటుంబ సభ్యులు, వధువు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో వరుడి బాబాయి లక్క పోగు సబ్బారావు మృతి చెందాడు. ఇరు కుటుంబాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.