యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని యాదమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. వృద్ధురాలి మృతిని నిరసిస్తూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగా ప్రమాదం జరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరు వైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.