మరో ఇండియన్ బాక్సర్ ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలోనే ఆగిపోయాడు. 91 కేజీల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ బాక్సర్ సతీష్ కుమార్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ చేతిలో 0-5 తో ఓడిపోయాడు. తొలి రౌండ్ నుంచే సతీష్ పై పూర్తిగా పైచేయి సాధించిన జలలోవ్ ను ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జీలు విజేతగా ప్రకటించారు. ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్ ల […]
Written By:
Suresh, Updated On : August 1, 2021 10:16 am
Follow us on
మరో ఇండియన్ బాక్సర్ ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలోనే ఆగిపోయాడు. 91 కేజీల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ బాక్సర్ సతీష్ కుమార్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ చేతిలో 0-5 తో ఓడిపోయాడు. తొలి రౌండ్ నుంచే సతీష్ పై పూర్తిగా పైచేయి సాధించిన జలలోవ్ ను ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జీలు విజేతగా ప్రకటించారు. ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్ ల ముందు సతీష్ నిలవలేకపోయాడు.