విశాఖ శివారులోని వాంబే కాలనీలో కరోనా డెల్టా వేరియంట్ కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. వాంబే కాలనీకి చెందిన 51 ఏళ్ల మహిళలో డెల్టా రకం వైరస్ గుర్తించినట్లు డీఎంహెచ్వో సత్యనారాయణ వెల్లడించారు. గతేడాది కరోనా బారిన పడిన సదరు మహిళ హో ఐసోలేషన్ లో ఉండి కోలుకున్నారు. ఇటీవల కరోనా అనుమానంతో మధురవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా వైద్యులు పాజిటివ్ గా తేల్చారు. ఆమె నమూనాలను హైదరాబాద్ పంపారు. ఆమెకు డెల్టా రకం వైరస్ సోకిందని నివేదిక వచ్చిందని గుర్తించారు.