
ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసెట్ కన్వీనర్ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 22,834 మంది మాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 17,864 మంది, వరంగల్ లో 5,323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.