తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో దళితబంధు, ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీపై చర్చిస్తున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఈ భేటీలో చర్చ జరిగే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు దళిత బంధును హుజూరాబాద్ లో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు […]

Written By: Velishala Suresh, Updated On : August 1, 2021 2:51 pm
Follow us on

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో దళితబంధు, ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీపై చర్చిస్తున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఈ భేటీలో చర్చ జరిగే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు దళిత బంధును హుజూరాబాద్ లో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.