తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం ఓ కొలిక్కి వస్తోంది. రెండు కూటములా? త్రిముఖ పోటీనా? అన్నది తేలనుంది? సీట్ల పంపిణీ ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చింది.. ఈరోజు ప్రధాన పార్టీల సీట్ల పంపకం పూర్తి అయ్యింది.
మూడో శక్తిగా వచ్చిన బీజేపీ పరిస్థితి తమిళనాడులో ఎలా ఉంది? ఒకటి పోయిన లోక్ సభ ఎన్నికల్లో 20శాతం ఓట్లు వచ్చిన అన్నాడీఎంకే కు 170 సీట్లు, 11 శాతం వచ్చిన బీజేపీకి 27 సీట్లు అసెంబ్లీకి ఇచ్చారు. ఇది ఏ విధంగా న్యాయం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
దీనికి ఒక ముక్తాయింపు వచ్చింది. పోయినసారి బీజేపీకి వచ్చిన పర్సంటేజీ 11 శాతం చిన్న పార్టీలతో కలిసినే.. ఈసారి టీఎంసీ 5 సీట్లు కమలం గుర్తుపై పోటీచేస్తారు. సౌత్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా 1 సీటు కమలం గుర్తుపైనే పోటీచేస్తారు. ఇవన్నీ కలిపితే 32 సీట్లు అవుతాయి.. బీజేపీ కూటమికి 32 సీట్లు అని అంటున్నారు.
రెండోది ఒకటి కాంగ్రెస్.. లాస్ట్ టైం 10 శాతం ఓట్లువచ్చాయి. 28 సీట్లు డీఎంకే కేటాయించింది. బీజేపీ 11 శాతం వచ్చినా తక్కువ సీట్లకు ఒప్పుందన్నది ప్రశ్న.
దేశ రాజకీయాల కోసం తమిళనాడు బీజేపీ భవిషత్తు బలి? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

