దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నేపథ్యంలో నేడు కాంగ్రెస్ ఎంపీలతో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వర్చువల్ భేటీ కానున్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహం పై చర్చించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. బడ్జెట్ సమావేశఆల తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుండటం ఇదే తొలిసారి. కాగా దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగజలాడుతుంటే థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.