
ఏపీలో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి కట్టడిపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ పై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు.