Homeక్రీడలుక్రికెట్‌India vs England : టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచాడు.. ఇంగ్లాండ్ తో ఈ మ్యాచ్...

India vs England : టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచాడు.. ఇంగ్లాండ్ తో ఈ మ్యాచ్ కూడా అస్సామేనా..

India vs England : గతంలో టీమిండియా కెప్టెన్లు టాస్ గెలవడం అసాధ్యంగా ఉండేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే టాస్ గెలిచేవారు. టాస్ గెలిచినప్పటికీ.. ఓడిపోయినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్లు నాడు విలక్షణమైన ఆట తీరు ప్రదర్శించేవారు. మైదానంలో సరికొత్తగా కనిపించేవారు. తోటి ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేవారు. ఫలితంగా టీం ఇండియాకు సానుకూలమైన ఫలితాలు వచ్చేవి.

ఇప్పుడు టీమిండియా టి20 సారథి శ్రేయస్ అయ్యర్ వరుసగా టాస్ గెలుస్తూనే ఉన్నాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్లో కూడా అతడు టాస్ గెలిచాడు. మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు సారధిగా అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఐదవ మ్యాచ్. కానీ అతడి నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అనామకమైన ఐర్లాండ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా జరిగి ఉంటే ఫలితం వేరే విధంగా వచ్చి ఉండేది. అప్పుడు టీమ్ ఇండియా వరుసగా రెండవ సిరీస్ కూడా కోల్పోయి ఉండేది.

ప్రస్తుత సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు మీద ఉంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం.. రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడం.. మూడో మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ భారీ అంతరంతో గెలవడం విశేషం. అయితే టీమిండియా ఓడిపోయిన అన్ని సందర్భాల్లోనూ సారధి అయ్యర్ టాస్ నెగ్గడం విశేషం. టీమిండియా సారథి టాస్ నెగ్గిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచినప్పటికీ.. టీమిండియాకు విజయాలు సొంతం కాలేదు. పైగా దారుణమైన స్థితిలో ఓటములు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోతేనే బాగుంటుంది.. అప్పుడే టీమిండేకు గెలుపు దక్కుతుందేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో అయ్యర్ నాయకత్వ తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ప్రారంభంలో ముందుకు నడిపించడాని.. ఆ తర్వాత అతడి సారథ్యం పంజాబ్ జట్టుకు విజయాలు అందించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం అతడి వైఫల్యాల చరిత్ర చూసైనా సరే మేనేజ్మెంట్ టీ20 సారధిగా అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ని పక్కనపెట్టి.. అయ్యర్ ను నెత్తి మీద పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క టాస్ ఓడిపోలేదు.. ఒక్క మ్యాచ్ గెలవలేదు.. ఇది అయ్యర్ రికార్డ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular