హత్రాస్‌ బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన నిర్బయ న్యాయవాది…

ఢిల్లీలో అత్యంత దారుణకు అత్యాచారానికి గురై హత్యగావింపబడ్డ నిర్బయ కేసును వాదించి గెలిపించిన న్యాయవాది సీమా కుష్వాహా మరో ప్రముఖ కేసు టేకాఫ్‌ చేయనుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యువతిపై కొందరు పాశవికంగా దాడి చేసి హత్య చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.ఈ నేపథ్యంలో బాధితురాలి తరుపున సీమా వాదించనున్నట్లు తెలుస్తోంది. గురువారం సీమా బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మాట్లాడుతూ యువతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరారరన్నారు. దీంతో […]

Written By: NARESH, Updated On : October 2, 2020 3:56 pm
Follow us on

ఢిల్లీలో అత్యంత దారుణకు అత్యాచారానికి గురై హత్యగావింపబడ్డ నిర్బయ కేసును వాదించి గెలిపించిన న్యాయవాది సీమా కుష్వాహా మరో ప్రముఖ కేసు టేకాఫ్‌ చేయనుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యువతిపై కొందరు పాశవికంగా దాడి చేసి హత్య చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.ఈ నేపథ్యంలో బాధితురాలి తరుపున సీమా వాదించనున్నట్లు తెలుస్తోంది. గురువారం సీమా బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మాట్లాడుతూ యువతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరారరన్నారు. దీంతో ఆ కుటుంబాన్ని కలవడానికి వచ్చానన్నారు. అయితే పోలీసులు అడ్డుకున్నా వారిని కలిసే తీరుతామన్నారు.

Also Read: రాజధాని నడిబొడ్డున బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు