రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య మృతి

నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి చెందారు. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్ లో ఆయన చేరారు. గత నాలుగు రోజులుగా వెండిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. కరోనా సోకిన తర్వాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని కోటయ్య తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు ఆయన ప్రకటించారు. కోటయ్య ప్రకటనతో ఆనందయ్య ఆయుర్వేద ఔషధం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కోటయ్యకు ఆక్సిజన్ స్థాయిలు […]

Written By: Suresh, Updated On : May 31, 2021 10:58 am
Follow us on

నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి చెందారు. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్ లో ఆయన చేరారు. గత నాలుగు రోజులుగా వెండిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. కరోనా సోకిన తర్వాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని కోటయ్య తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు ఆయన ప్రకటించారు. కోటయ్య ప్రకటనతో ఆనందయ్య ఆయుర్వేద ఔషధం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కోటయ్యకు ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ రోజు మృతి చెందారు.