కరోనా ప్రభావంతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. పరీక్షను ఎప్పుడ నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ లో జరగాల్సి ఉన్నది. కాగా మెయిన్ ఆగస్టులో జరగనున్న మెయిన్స్ పరీక్ష గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.