ప్రతిష్ఠాత్మక చార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సర్కారు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు యాత్ర వాయిదా కొనసాగుతుందని పేర్కొన్నది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేపథ్యంలో కొవిడ్ సంబంధ మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది.