శ్రీశైలం ప్రాజెక్టు వద్ద బందోబస్తు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఆనకట్ట వద్దకు స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4 టీఎంసీల […]

Written By: Suresh, Updated On : July 2, 2021 12:05 pm
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఆనకట్ట వద్దకు స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4 టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది.