Homeజాతీయ వార్తలుpetrol price hike : పెంచుకుంటూ పోతున్నారు.. ఎన్నాళ్ళు ఈ పెట్రోమంట

petrol price hike : పెంచుకుంటూ పోతున్నారు.. ఎన్నాళ్ళు ఈ పెట్రోమంట

petrol price hike : పెంచుడు కార్యక్రమం దర్జాగా సాగిపోతోంది. జనాలకు కూడా అలవాటైపోతుంది. మొదట్లో మూడు రూపాయలు పెంచారు. ఆ తర్వాత 90 పైసలు వడ్డించారు. ఇప్పుడు ఏకంగా 2.84 రూపాయలు పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్య జనం బతికే పరిస్థితి లేకుండా పోతోంది. ధరల స్థాయి నిరంతర పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రతి వస్తువు ధర కూడా ఆకాశంలో విహరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలను సాకుగా చూపించి వ్యాపారులు ఇతర వస్తువుల ధరలు కూడా పెంచుతున్నారు. దీనివల్ల సగటు మనిషి బతకలేక పోతున్నాడు.

సోమవారం ఉదయం నుంచి మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ పై 2.84.. డీజిల్ పై 2.86 రూపాయల ధర పెరిగింది. నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించిన దేశీయ చమురు రంగ సంస్థలు ధరలను విపరీతంగా పెంచాయి. ఈ ధరలు సోమారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే మూడు విడతలుగా డీజిల్, పెట్రోల్ ధరలను చమురు రంగ సంస్థలు పెంచేశాయి.. ఇప్పుడు పెరిగిన దర ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, లీటర్ డీజిల్ ధర 95.20కి విక్రయిస్తున్నారు.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 111.12, చెన్నైలో 107.77, విజయవాడలో 117.19, డీజిల్ 104.88, గుంటూరులో పెట్రోల్ 117.59, డీజిల్ 105.28, హైదరాబాదులో పెట్రోల్ 115.58, డీజిల్ 103.74 ధరలో లభ్యమవుతూ ఉంటుంది.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం తగ్గినప్పటికీ.. ఉద్రిక్తతలు ఒకప్పటి మాదిరిగా లేకపోయినప్పటికీ.. చమురు సరఫరాలో ఊహించిన వేగం లేదు. పైగా అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు యుద్ధం వల్ల ఏర్పడిన లాస్ ను పూడ్చుకోవడానికి క్రూడ్ ఆయిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీనివల్ల అన్ని దేశాలలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాలైతే చమురు వినియోగంలో అనేక షరతులు విధిస్తున్నాయి. ప్రజలను ఇష్టానుసారంగా వాడకూడదని సూచిస్తున్నాయి. దీంతో అన్ని రకాల సేవలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు చమురు ఆధారంగా సాగుతూ ఉంటాయి. చమురు ధరలు పెరిగితే చాలు ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. అందువల్లే యుద్ధం శాశ్వతంగా ముగిసి.. చమురు ధరలు సాధారణ స్థితికి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే శాంతి చర్చల నేపథ్యంలో అటు ఇరాన్.. ఇటు అమెరికా పట్టు విడుపులకు పోతున్న నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు మునుపటి స్థితికి వస్తుందో అర్థం కావడం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version