
మన దేశంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో సంచరీ కూడా దాటేశాయి. కానీ ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యాల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో అప్పటి నుంచి ఆగిపోయాయి. ఆ ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ ధరలు పెరగడం మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఘర రూ. 90.99 చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 81.42 చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.57 కు చేరగా డీజిల్ ధర రూ. 88.77 కు చేరింది.