
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.