ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యాలు ఆయన వ్యక్తిగతమైనవి ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యాలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మీడియా ప్రతినిధులు చెప్తే తప్ప ప్రధానిపై నాని ఏం వ్యాఖ్యాలు చేశారో తెలియదన్నారు. మోది గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని ..నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు.
Also Read: కొడాలి నాని.. తెలుసుకొని మాట్లాడు.. ఇదీ మోడీ రామభక్తి