మారిటోరియం చక్రవడ్డీ కేసు వాయిదా..

కరోనా నేపథ్యంలో రుణ గ్రహీతలకు అవకాశమిచ్చిన మారిటోరియంపైవేసిన కేసు విచారణ 13 వ తేదీకి వాయిదా పడింది. ప్రభుత్వం అపిఢవిట్‌లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రియల్‌ఎస్టేట్‌, బిల్డర్లను పట్టించుకోలేదన్న విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రుణగ్రహీతల నుంచి చక్రవడ్డీని మాఫీ చేయడానికి ప్రభుత్వానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతాయని, ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌ల వివరాలను బ్యాంకులు కేంద్రానికి సమర్పిస్తే ఆ నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తామని ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:07 pm
Follow us on

కరోనా నేపథ్యంలో రుణ గ్రహీతలకు అవకాశమిచ్చిన మారిటోరియంపైవేసిన కేసు విచారణ 13 వ తేదీకి వాయిదా పడింది. ప్రభుత్వం అపిఢవిట్‌లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రియల్‌ఎస్టేట్‌, బిల్డర్లను పట్టించుకోలేదన్న విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రుణగ్రహీతల నుంచి చక్రవడ్డీని మాఫీ చేయడానికి ప్రభుత్వానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతాయని, ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌ల వివరాలను బ్యాంకులు కేంద్రానికి సమర్పిస్తే ఆ నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తామని ప్రభుత్వం అపిడవిట్‌లో పేర్కొంది. ఈమేరకు విచరణ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్‌ వంటి అంశాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది.