
పోలవరం డీపీఆర్ -2 పై సోమవారం సమావేశం జరిగింది. నెలల తరబడి కేంద్రం వద్ద ఆమోదం పెండింగ్ లో ఉంది. కేంద్ర జలవనరులశాఖ అనుమతిస్తే డీపీఆర్ మంత్రి మండలికి వెళ్లనుంది. రివైజ్డ్ కమిటీ కోత పెట్టిన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంటుంది. కాగా ఇప్పటే రాష్ట్ర సీఎస్, జలవనరుల అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా డీపీఆర్ -2 పై రాష్ట్రం నుంచి అందించాల్సినదేమీ లేదని ప్రభుత్వం పేర్కొంది. రూ. 55,656కోట్లకు సాంకేతిక సలహా కమిటీ అనుమతిచ్చిందని, దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ. 47,725 కోట్టక ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.