కేరళలో గత 24గంటల్లో 8,553కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్టంలో ఇప్పటి వరకు 1,44,471మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 742గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య84,497 ఉన్నట్లు వెల్లడించారు. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య2,28,968 గా నమోదు అయినట్లు తేలిపారు. కేరళలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ విధించారు.