
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య గురించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్టపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలుదేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి సైనిక భద్రత కల్పించొచ్చు కదా అంటూ ట్వీటర్ లో పేర్కొన్నారు.