ఆదివారం ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం

వచ్చే ఆదివారం ఆన్ లైన్ లావాదేవీల సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్ బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక అప్ డేేషన్ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన అంటే మే 22 అర్ధరాత్రి […]

Written By: Velishala Suresh, Updated On : May 17, 2021 2:24 pm
Follow us on

వచ్చే ఆదివారం ఆన్ లైన్ లావాదేవీల సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్ బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక అప్ డేేషన్ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్ బీఐ తెలిపింది.