తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పరీక్షల రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.