రెండేళ్లలో ఏపీ తలరాత మారుతుందా?

ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు రావడం లేదు. పరిశ్రమల్ని ఆకర్షించడం లేదనే విమర్శలున్నాయి. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి తిప్పికొట్టారు. రెండేళ్లలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కన్నా ఏపీకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లో రూ.34,696 కోట్లు పెట్టుబడులు రాగా2020లో రూ.9,840 కోట్లు,2021లో ఇప్పటివరకు రూ.1030 కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు. ఈ స్థాయిలో పెట్టుబడులు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక కూడా సాధించలేకపోయాయన్నారు. ఈ రెండేళ్లలో నలబై వేల కోట్లు […]

Written By: NARESH, Updated On : June 9, 2021 11:38 am
Follow us on

ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు రావడం లేదు. పరిశ్రమల్ని ఆకర్షించడం లేదనే విమర్శలున్నాయి. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి తిప్పికొట్టారు. రెండేళ్లలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కన్నా ఏపీకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లో రూ.34,696 కోట్లు పెట్టుబడులు రాగా2020లో రూ.9,840 కోట్లు,2021లో ఇప్పటివరకు రూ.1030 కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు. ఈ స్థాయిలో పెట్టుబడులు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక కూడా సాధించలేకపోయాయన్నారు.

ఈ రెండేళ్లలో నలబై వేల కోట్లు పెట్టుబడులంటే ఆషామాషీ కాదు. భారీ స్థాయిలో వచ్చినట్లే. కియాపరిశ్రమను మొదటి దశలో పెట్టడానికి రూ.10 వేల కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. అంటే కియా లాంటివి నాలుగు పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నమాట. అంత భారీ స్థాయి పెట్టుబడులు కాకపోయినా ఎంఎస్ఎఈ రంగంలో ఈ పెట్టుబడులు వచ్చాయనుకుంటే కొన్ని లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించి ఉండేది.

అయితే ప్రభుత్వం ఈ విషయాన్నిప్రచారం చేసుకోవడంలో పూర్తిస్థాయిలో విఫలమైంది. ప్రతి పథకానికి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చినట్లుగా తాము వచ్చిన తర్వాత రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల వివరాలు వాటి ద్వారా ఎవరెవరికి ఎంత మందికి ఉఫాధి లభించిందో ప్రకటిస్తే ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టినట్లవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓ ఇంటిలిజెంట్ తో పాటు పులివెందులలో కొన్ని పరిశ్రమలు అనంతపురంలో ఐస్ తయారీ పరిశ్రమ అంటూ కొన్ని ప్రకటనలు అప్పట్లో వచ్చాయి. వాటి సంగతి ఏమయిందో ఎవరికి తెలియదు. కొత్తగా పరిశ్రమకైనా శంకుస్థాపన జరిగినట్లుగా ఎక్కడా లేదు. చివరికి లాక్ డౌన్ కారణంగా పెద్ద ఎత్తున చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని లెక్కలు వెలుగులోకి వచ్చాయి.