India Parliament special session : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు వాడి వేడీగా జరుగబోతున్నాయి. మూడురోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మూడు బిల్లులు ప్రవేశపెట్టాను. ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు.. 2వది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు.. 3వది కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు..
నియోజకవర్గాలను ఇప్పుడున్న వాటికంటే 50 శాతం అదనంగా పెంచాలని నిర్ణయించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. ఈ మూడింట్లో ఇవే రెండు కీలక బిల్లులు. మరి వివాదం ఎందుకు ఉందని చూస్తే..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో మూడింట ఒక వంతు ఉందో సూత్రబద్దంగా ప్రతీ పార్టీ ఓకే చెప్పింది. కానీ ఎక్కడో దీనికి మెలికలు ఉన్నాయి. అసలు నియోజకవర్గాలు పెంచకుండా కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయవద్దా? అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గాల పెంపు జరిగినట్లయితే 50 శాతం పెంచితే ఎలా పెంచాలన్న దానిపైనే వివాదం మొదలైంది.
మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గ పెంపు పార్లమెంట్ ఆమోదిస్తుందా ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

