
ఒలింపిక్స్ సెమీస్ లో భారత్- బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. రెండో క్వార్టర్ ముగిసే సమయానికి ఇరుజట్లు చెరో రెండు గోల్స్ సాధించాయి. మ్యాచ్ తొలి క్వార్టర్ లోనే భారత్ ఆటగాళ్లు రెండు గోల్స్ సాధించారు. ఏడో నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ తొలి గోల్ సాధించాడు. ఎనిమిదో నిమిషంలో మన్ దీప్ సింగ్ రెండో గోల్ సాధించాడు. రెండో క్వార్టర్ తొలి నిమిషంలో బెల్జియం ఆటగాళ్లు రెండో గోల్ సాధించారు.