త్వరలోనే అందరం టోల్ ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారులపై టోల్ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా కేంద్రం జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు. ఇందుకు రాబోయే మూడు నెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు.