ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై సమావేశంలో ముందుగా చర్చ జరగగా పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని.. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అన్ని వాదించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులపై కౌన్సిల్ ఎటువంటి […]

Written By: NARESH, Updated On : October 5, 2020 8:23 pm
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై సమావేశంలో ముందుగా చర్చ జరగగా పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని.. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అన్ని వాదించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులపై కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.