CM Revanth Reddy: రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా 40 వ జాతీయ క్రీడలు నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులివ్వాలి. జాతీయ క్రీకల్లో పాల్గొనేవారికి రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలని కోరారు.