ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో నలుగురిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులు కొండపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. అర్ధవీడులో వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.