నాగమల్ల వెంకట నర్శయ్య ఆత్మహత్య కేసులో మాజీ ఏఎస్ఐమోహన్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. వెంకట నర్శయ్య తన ఆత్మహత్య నోట్ లో తన ఫ్లాటును అక్రమంగా మోహనరెడ్డి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని రాసి గత నెల 28 నాచారంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కేసులో మోహన్ రెడ్డి తో పాటు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగభూషణ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నాచారం పోలీసులు తెలిపారు.