హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయిన్పల్లి, మల్కాజ్గిరి ఏరియాల్లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఇ5గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుండి 155 గ్రాముల నిషేధిత హపీస్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు సాయి రెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుండి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారు. కాగా విక్రమ్, సాయి లు పరారీ లో ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు పోలీసులు తెలిపారు.