
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90,966 కరోనా పరీక్షలు నిర్వహించగా 578 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,36,627కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 3 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,759కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,824 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.