
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,18,778 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,738కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 848 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,064 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి.