
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 8 ఆసియా సింహాలు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24 నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్ లో ఉంచారు. అలాగే వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.