ఎంటర్టైన్మెంట్Jana Nayagan Release : 'జన నాయగన్' టికెట్ రేట్స్ పై సీఎం విజయ్ సంచలన...

Jana Nayagan Release : ‘జన నాయగన్’ టికెట్ రేట్స్ పై సీఎం విజయ్ సంచలన నిర్ణయం..

Jana Nayagan Release : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నుండి రాబోతున్న మొట్టమొదటి చిత్రం ‘జన నాయగన్ ‘. జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సుమారుగా 6 నెలలు వాయిదా పడి , ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ ని రప్పించుకొని ఈ నెల 23 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఒక్క తమిళనాడు లోనే ఈ చిత్రం 950 థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000 స్క్రీన్స్ లో రిలీజ్ ఉంటుందట. అయితే అభిమానులు ఈ చిత్రాన్ని ఏ హీరో కూడా ముట్టుకోలేని రేంజ్ కలెక్షన్స్ ని అందించాలని అందుకున్నారు.

అందుకోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేట్స్ పెంచితే బాగుంటుందని సోషల్ మీడియా లో సీఎం విజయ్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేశారు. కానీ విజయ్ మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదట. సినిమా అనేది ప్రేక్షకులకు తక్కువ ధర తో అందాలని , ఎలాంటి టికెట్ రేట్స్ పెంచేది లేదని , ఒకవేళ ఏ థియేటర్ అయినా టిక్కెట్ రేట్స్ పెంచినట్టు నా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారు. దీంతో సాధారణ టికెట్ రేట్స్ తోనే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ ని బుకింగ్స్ ని తమిళనాడు లో నిన్న ప్రారంభించారు. బుకింగ్స్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయం లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా చెన్నై సిటీ లో టికెట్ ముక్క దొరకడం చాలా కష్టమైపోయింది. విజయ్ చివరి చిత్రం అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరీ.

అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనే సందేహాలు ట్రేడ్ విశ్లేషకుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు అవ్వలేదు. నార్త్ అమెరికా లో సాధారణంగా ఒక సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కనీసం రెండు వారాల ముందు మొదలు పెడుతుంటారు. కానీ ఈ చిత్రం విడుదలకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు. ఇది కాస్త ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి ‘ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా , విజయ్ కి కూతురిగా మమిత బైజు నటించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Jana Nayagan : రీమేక్ అన్నారు.. లీకైంది అన్నారు.. కానీ ‘జన నాయగన్’ కి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే..

Jana Nayagan : ఒకప్పుడు టాక్ , డైరెక్టర్ , హైప్ తో సంబంధం లేకుండా సౌత్ ఇండియా లోని స్టార్ హీరోలకు తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి...

Vijay Jana Nayagan : విజయ్ సీఎం అయితే నాకేంటి అంటున్న హీరో కిరణ్ అబ్బవరం..అసలు ఏమైందంటే..

Vijay Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు సెన్సార్ ఇక్కట్లను తొలగించుకొని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Exit mobile version